ప్రజావాణిలో 494 దరఖాస్తులు

– సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 494 దరఖాస్తులు అందాయని తెలిపారు. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 125, హౌసింగ్‌ 43, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల శాఖలకు 71, హోం శాఖకు సంబంధించి 45, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 47, హోం శాఖకు సంబంధించి 42, ఇతర శాఖలకు సంబంధించి 48 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.న

Spread the love