ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్‌లోని కరౌలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండాపూర్ వద్ద బొలెరో, డీసీఎం ఢీకొన్న ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పలువురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. రోడ్డు మలుపు దగ్గర బొలెరో అదుపు తప్పి డీసీఎంను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

Spread the love