నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకేసారి 25 మంది ట్రాన్స్జెండర్లు ఫినాయిల్ సేవించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. బాధితులందరినీ వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటనను మహారాజా యశ్వంతరావ్ హాస్పిటల్ (ఎంవైహెచ్) ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ బసంత్ కుమార్ నింగ్వాల్ ధ్రువీకరించారు. ఫినాయిల్ తాగడం వల్ల తీవ్ర అస్వస్థతకు లోనైన సుమారు 25 మంది ట్రాన్స్జెండర్లు తమ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన మీడియాకు తెలిపారు. వారందరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అవసరమైన చికిత్స అందిస్తున్నారని వివరించారు. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో ట్రాన్స్జెండర్లు ఒకేసారి ఎందుకు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారనే దానిపై స్పష్టత రాలేదు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఒకేసారి 25 మంది ట్రాన్స్జెండర్లు ఆత్మహత్యాయత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES