Thursday, October 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకర్నూలు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ

కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ తదితరులు స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి మోడీ సున్నిపెంట చేరుకోనున్నారు. రోడ్డుమార్గంలో శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్నం 12.05 గంటల వరకు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో ఉంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నన్నూరుకు వచ్చి ‘సూపర్‌ జీఎస్టీ.. సూపర్‌ సేవింగ్స్‌’ సభకు హాజరవుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -