- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జర్మనీలోని మ్యూనిక్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సరుకు రవాణా కోసం మాత్రమే వినియోగించే రైల్వే వంతెనపై రెండు గూడ్స్ రైళ్లు ఢీకొని పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఢీకొన్న తర్వాత రైలు బోగీలు వంతెనపై నుంచి కిందపడి రోడ్డుపైకి దూసుకొచ్చాయి. ప్రమాదానికి గల కారణాలు, నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -



