- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లోని పాక్తిక ప్రావిన్స్లో పాకిస్థాన్ చేసిన వైమానిక దాడుల్లో ముగ్గురు అఫ్గాన్ దేశవాళీ క్రికెటర్లు మృతి చెందారు. వీరంతా పాక్, శ్రీలంకతో ఆడే ట్రై నేషన్ సిరీస్ కోసం ఉర్గాన్ నుంచి శరనకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో మొత్తం ముగ్గురు క్రికెటర్లు సహా 8 మంది మృతి చెందారు. మృతి చెందిన క్రికెటర్లను కబీర్, సిబాతుల్లా, హరూన్గా గుర్తించారు. ఈ దాడి కారణంగా అఫ్గానిస్థాన్ ట్రై సిరీస్ నుంచి వైదొలగింది.
- Advertisement -