- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో భారీగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతులిద్దరూ అచ్యుతాపురం వాసులుగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Advertisement -



