Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పనులను వెంటనే పూర్తి చేయాలి: ఎంపీడీవో

పనులను వెంటనే పూర్తి చేయాలి: ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
ఉపాధి హామీ పనులపై సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ ఉపాధి హామీ పనులపై ఉపాధి హామీ సిబ్బందితో గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ… ఉపాధి హామీ కూలీలకు ఈ కేవైసీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకంలో భాగంగా బేస్మెంట్, పైకప్పు లెవెల్ పేమెంట్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి పేమెంట్లు వెంటనే ప్రారంభించాలని తెలిపారు. నర్సరీ, వన మహోత్సవం నిర్వహణ క్రమం తప్పకుండా చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఏపీవో జీ. నర్సయ్య, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్, టెక్నికల్ అసిస్టెంట్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మెట్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -