- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించినట్లు ఐ ఆర్ పి మహేందర్ తెలిపారు. ప్రతి మంగళవారం, గురువారం ఫిజియోథెరపీ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, వివిధ గ్రామాల నుంచి వచ్చిన 9 మంది విద్యార్థులకు ఫిజియోథెరపిస్ట్ నవీన్ ఆధ్వర్యంలో చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు భవాని, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



