Friday, October 31, 2025
E-PAPER
Homeఆటలుభారత్‌తో సెమీస్‌.. ఆస్ట్రేలియా ఫస్ట్‌ బ్యాటింగ్‌

భారత్‌తో సెమీస్‌.. ఆస్ట్రేలియా ఫస్ట్‌ బ్యాటింగ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో రెండో సెమీస్‌కు సమయం ఆసన్నమైంది. బలమైన ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. ఫస్ట్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. లీగ్‌ స్టేజ్‌లో ఆసీస్‌ చేతిలో ఓడిన టీమ్‌ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు ఇప్పటివరకు 60 వన్డేలు ఆడగా.. 11 మ్యాచ్‌లు నెగ్గి, 49 ఓడింది. ప్రపంచకప్‌లో ఇప్పటికే దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంది. తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఆ జట్టు చిత్తు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -