- Advertisement -
నవతెలంగాణ నకిరేకల్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించాలని కోరుతూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రచారం నిర్వహించారు. లింగయ్య ఆధ్వర్యంలో బోరబండ డివిజన్ లోని వినాయక నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదల కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు ఉన్నారు.
- Advertisement -



