నవతెలంగాణ హైదరాబాద్: ఛత్తీస్గఢ్లో నాలుగు ఏనుగులు ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయాయి. దీంతో వాటిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఛత్తీస్గఢ్లోని బర్నవాపారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హార్దీ గ్రామంలోని ఓపెన్ బావిలో ఏనుగులు పడిపోయినట్లు స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఈ క్రమంలో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.వాటిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి అరుణ్కుమార్ పాండే పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ విభాగాల్లో ఓపెన్ బావులు లేకుండా చూసుకునేందుకు కృషి చేస్తామన్నారు.

                                    

