- Advertisement -
నవతెలంగాణ మణిపూర్: మణిపూర్ చందేల్లోని ఇండియా-మయన్మార్ సరిహద్దు సమీపంలో ఎన్ కౌంటర్ జరిగింది. దీనిలో 10 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. చందేల్ జిల్లాలోని ఖెంగ్ జోయ్ తహసీల్లోని న్యూ సమతాల్ గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్ యూనిట్ పై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీన్ని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఎన్ కౌంటర్ లో 10మంది ఉగ్రవాదులు మరణించినట్టు తూర్పు కమాండ్ ట్విట్టర్ ఎక్స్ లో ట్వీట్ చేసింది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
- Advertisement -