- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రైతులకు ప్రత్యేకంగా, నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించాలనే లక్ష్యంతో తీసుకొస్తున్న ‘రైతు డిస్కం’ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు TGRPDCLకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి లైసెన్స్ జారి చేసింది. నాలుగు నెలల్లో డిస్కం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపింది. అలాగే రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని ERC ప్రకటించింది. మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని స్పష్టం చేసింది.
- Advertisement -


