- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ సింగర్ ఎస్. జానకి శనివారం కన్నుమూశారు. మైసురులోని తన నివాసంలో ఆమెకు కార్డియక్ అరెస్ట్ జరగడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారం కూడా ఆమె మృతికి కారణంగా తెలుస్తోంది. అన్ని భాషలలో కలిపి జానకి 48 వేలకు పైగా పాటలు పాడారు. “నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా” అని ఆమెను పిలుస్తారు.
- Advertisement -


