- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన చందాదారులకు తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీని ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 34 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లోకి వడ్డీ సొమ్ము జమ కానుంది. 2026 జులై 15 నాటికి సభ్యులందరి పాస్బుక్లలో అప్డేట్ అయిన బ్యాలెన్స్ కనిపిస్తుందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -


