- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: గురుకుల హాస్టళ్లకు నిత్యావసరాలు, కాస్మొటిక్స్ ను సరఫరా చేసే బాధ్యతను మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన సరకులు అందడంతో పాటు మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇది దోహదం చేస్తుందని భావిస్తోంది. ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు చేసేలా చర్యలు చేపట్టినట్టు సమాచారం.
- Advertisement -