Monday, November 10, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ కాలుష్యంపై బీజేపీ నిర్ల‌క్ష్యం..రోజురోజుకు దిగ‌జారుత‌న్న గాలి నాణ్య‌త‌

ఢిల్లీ కాలుష్యంపై బీజేపీ నిర్ల‌క్ష్యం..రోజురోజుకు దిగ‌జారుత‌న్న గాలి నాణ్య‌త‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ప‌లు రోజుల నుంచి గాలి నాణ్య‌త ప‌డిపోతుంది. సోమవారం ఉదయం 7 గంటల సమయానికి ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 354గా నమోదైంది. దీన్ని చాలా పూర్‌ కేటగిరీగా పేర్కొంటారు. కొన్ని ఎయిర్‌ మానిటరింగ్‌ స్టేషన్లలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఆనంద్‌ విహార్‌లో ఏక్యూఐ 379గా నమోదైంది. ఐటీవో ప్రాంతంలో 376, ఛాందినీ చౌక్‌ ప్రాంతంలో 360, ఓఖ్లా ఫేజ్‌-2లో 348, జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం వద్ద 316, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (టెర్మినల్‌-3) వద్ద 305, నోయిడా సెక్టార్‌ 62వద్ద 342, సెక్టార్‌-1లో 325, సెక్టార్‌ 116 ప్రాంతంలో 339, గురుగ్రామ్‌ సెక్టార్‌ 51 వద్ద 327గా ఏక్యూఐ లెవెల్స్‌ నమోదయ్యాయి.

ఢిల్లీలో గాలి కాలుష్యంపై బీజేపీ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంపై ప్ర‌జ‌లు ఆందోళ‌న చేపట్టిన విష‌యం తెలిసిందే. ఆదివారం ఇండియా గేట్‌ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఆప్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలతోపాటు ఢిల్లీ వాసులు ఇండియా గేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జీవించే హక్కు తమకు ఉన్నదని నినాదాలు చేశారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల చర్యపై ఢిల్లీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -