- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కృష్ణా జిల్లా ఉయ్యూరు గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి జాతీయరహదారి పైనుంచి సర్వీసు రోడ్డులోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో విజయవాడ, కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలవడంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- Advertisement -



