Tuesday, June 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభార‌త్‌తో శాంతి చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మే: పాక్ ప్ర‌ధాని

భార‌త్‌తో శాంతి చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మే: పాక్ ప్ర‌ధాని

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సింధూ జలాల నిలిపివేత‌తో ఖంగుతిన్న పాక్, ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో భార‌త్ చేసిన దాడికి పాకిస్థాన్ దేశానికి దిమ్మ‌తిరిగి బొమ్మ‌క‌న‌ప‌డింది. దీంతో కాల్పుల విర‌మ‌ణ సందేశంతో కాళ్ల‌బేరానికి వ‌చ్చిన షరిఫ్ ప్ర‌భుత్వం..తాజాగా మ‌రో కీల‌క ప్ర‌తిపాద‌న చేసింది. భార‌త్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ ప్ర‌క‌టించారు. శాంతి స్థాప‌న కోసం భార‌త్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు.ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న క‌మ్రా ఎయిర్ బేస్‌ను విజిట్ చేసిన త‌ర్వాత ఆయ‌న మాట్లాడారు. అక్క‌డ ఉన్న సైనికులు, మిలిట‌రీ ఆఫీస‌ర్ల‌ను ఆయ‌న క‌లిశారు. శాంతి స్థాప‌న కోసం పాకిస్థాన్ సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే శాంతి చ‌ర్చ‌ల కోసం క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ష‌రుతుగా పెట్టారాయ‌న‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -