Monday, November 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీహార్‌ సీఎంగా నితీశే..బీహార్‌ బీజేపీ చీఫ్‌

బీహార్‌ సీఎంగా నితీశే..బీహార్‌ బీజేపీ చీఫ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 202 సీట్లతో జయభేరి మోగించింది. ఇందులో బీజేపీకి 89, నితీశ్‌ కుమార్‌కు చెందిన జేడీ(యూ)కు 85, కూటమి పార్టీలైన ఎల్‌జేపీ (రామ్‌ విలాస్‌)కి 19, హెచ్‌ఏఎం 5 , ఆర్‌ఎల్‌ఎస్‌పీ 4 సీట్లలో విజయం సాధించాయి. దీంతో రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టేందుకు ఎన్డీయే కూటమి సిద్ధమవుతోంది. అదే సమయంలో సీఎం ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటి వరకూ బీహార్‌ సీఎంగా జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజా ఫలితాల్లో బీజేపీకి అత్యధిక సీట్లు రావడంతో నితీశ్‌ కుమార్‌ను తప్పించి కమలం పార్టీకి చెందిన నేతను సీఎంగా ప్రకటించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై బీహార్‌ బీజేపీ చీఫ్‌ స్పష్టతనిచ్చారు. నితీశ్‌ కుమారే సీఎంగా కొనసాగుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ జైస్వాల్‌ స్పష్టం చేశారు. బీజేపీ శానసభా పక్షం రేపు ఉదయం 10 గంటలకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలమంలో తన నాయకుడిని ఎన్నుకుంటుందని తెలిపారు. ఆ తర్వాత వెంటనే ఎన్డీయే శానసభా పక్షం సమావేశమై నితీశ్‌ కుమార్‌ను సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -