నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య పర్యటనలో భాగంగా ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి శుక్రవారం చేరుకున్నారు. గురువారం ఆయన సౌది అరేబియా, ఖతార్లను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా యుఎఇతో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో అమెరికాలో 1.4 ట్రిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే 28 వైడ్ -బాడీ బోయింగ్ విమానాలను అమెరికా నుంచి యుఎఇ కొనుగోలు చేయనున్నట్లు యుఎఇ ప్రభుత్వం వెల్లడించింది. అయితే ట్రంప్ పన్నులను పెంచిన నేపథ్యంలో ప్రతికూలతలు ఎదురవుతాయి అన్న ఊహాగానాలకు వ్యతిరేకంగా ఆయన పర్యటనలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
యుఎఇతో అమెరికా వాణిజ్య ఒప్పందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES