- Advertisement -
కోల్కతా/రాంచీ : బొగ్గు మాఫియా, మైనింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. రెండు రాష్ట్రాల్లోని సుమారు 45 ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి వంద మందికి పైగా ఈడీ అధికారులు, సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. జార్ఖండ్లో సుమారు 18 ప్రాంతాల్లో, పశ్చిమబెంగాల్లోని పురులియా, దుర్గాపూర్, హౌరా, కోల్కతా జిల్లాల్లోని సుమారు 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
- Advertisement -



