- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో 2025–27 సంవత్సరానికి కేటాయించిన మద్యం షాపులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలుండడంతో ఎక్సైజ్ శాఖ లైసెన్స్ జారీ, మద్యం సరఫరా ఏర్పాట్లను వేగవంతం చేసింది. రాష్ట్రంలో 2,620 షాపులు ఉండగా, ఎన్నికలు, డిసెంబర్ 31 వేడుకలు, సంక్రాంతి, మేడారం జాతర నేపథ్యంలో మూడు నెలలు భారీ సేల్స్ ఉండనున్నాయని అధికారులు అంచనా. ఈ క్రమంలో మద్యం కొరత రాకుండా ఉండేలా చర్యలు చేపట్టేందుకు ఎక్సయిజ్ శాఖ సన్నద్ధం అవుతుంది.
- Advertisement -



