- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2పై ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2015-16లో నిర్వహించిన గ్రూప్-2లో ఎంపికైన వారి జాబితాను రద్దు చేస్తూ ఇటీవల ఉన్నత న్యాయస్థానం సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. వైట్నర్, దిద్దుబాటు ఉన్న జవాబుపత్రాల మూల్యాంకనంపై అసహనం వ్యక్తం చేసింది. తాజాగా గురువారం సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సీజే ధర్మాసనం రద్దు చేసింది.
- Advertisement -



