Monday, June 9, 2025
E-PAPER
Homeజాతీయంటీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క వ్యాఖ్యలు

టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క వ్యాఖ్యలు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆప‌రేష‌న్ సిందూర్ పై, పాక్ పై దౌత్య యుద్ధానికి ఆయా పార్టీల‌కు చెందిన ఏడుగురు ఎంపీలతో ప్ర‌తినాయ‌క బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఈనెల 23నుంచి 30దేశాల్లో ఆయా బృందాలు ప‌ర్య‌టించ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఆల్ పార్టీ ఎంపీ బృందంపై త‌మకు స‌మాచారం అంద‌లేద‌ని, కేంద్రం నుంచి ఎలాంటి ప్ర‌తిపాద‌న రాలేద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసిన స‌భ్యుల్లో త‌మ పార్టీనుంచి యూస‌ప్ ప‌ఠాన్ పేరుంద‌ని, కానీ కేంద్రం నుంచి ఎలాంటి స‌మాచారం త‌మ‌కు అంద‌లేనిద‌ని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు. తామేమి కేంద్ర నిర్ణ‌యాల‌ను ప్ర‌తిఘ‌టించ‌లేద‌ని, ఆప‌రేష‌న్ సిందూర్‌కు త‌మ పార్టీ మ‌ద్ద‌తు తెలిపింద‌ని గుర్తు చేశారు. ఒక‌వేళ కేంద్రం నుంచి ప్ర‌తిపాద‌న వ‌స్తే, అందుకు త‌గ్గ‌ట్లుగా స్పందించే వాళ్ల‌మ‌ని, తామేమి ఆప‌రేష‌న్ సిందూర్ ను బాయ్ కాట్ చేయాలేద‌ని సీఎం మ‌మ‌త అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -