- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత సురేష్బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. ఈ రోజు జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం 48 మంది కార్యవర్గానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31, మన ప్యానెల్ నుంచి 17 మంది గెలుపొందారు. కార్యదర్శిగా అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ, కోశాధికారిగా ముత్యాల రామదాసులు గెలుపొందారు.
- Advertisement -



