నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇవాళ కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇవాళ గంగమాంబ జాతరలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే గంగమాంబ అమ్మవారిని దర్శించుకుని అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సీఎం చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం 12:30 గంటలకు ద్రవిడ యూనివర్సిటీ గ్రౌండ్ కు హెలికాప్టర్లో చేరుకొని అక్కడి నుంచి కుప్పం నియోజకవర్గానికి రోడ్డు మార్గం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తారు. సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో కుప్పంలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేశారు.
నేడు గంగమాంబ జాతరకు ఏపీ సీఎం చంద్రబాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES