- Advertisement -
నవతెలంగాణ ఢాకా: బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని, బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా(80) కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నవంబర్ 23న ఢాకాలోని ఎవర్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆమె న్యుమోనియాతో బాధపడుతున్నట్టు డాక్టర్లు నిర్ధరించారు. ఆ తర్వాత వేగంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. గుండె, కిడ్నీ, లివర్, డయాబెటిస్, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం 6 గంటలకు ఫజ్రు ప్రార్థనల తర్వాత ఆమె తుదిశ్వాస విడిచారు.
- Advertisement -



