- Advertisement -
నవతెలంగాణ విజయవాడ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురం మండలం పులిదిండిలో పడవ పోటీల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ట్రయల్ రన్ పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలను జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన ఎక్కిన పడవ అదుపుతప్పి కాలువలో పడిపోయింది. వెంటనే అక్కడున్న స్విమ్మర్లు కలెక్టర్ ను రక్షించి వేరే పడవలోకి ఎక్కించారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది.
- Advertisement -



