- టీవీకే జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటములను వెనక్కు నెట్టి విజయ్ పార్టీ ముందంజలో ఉంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఆ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఎవరి మద్దతు లేకుండా సొంతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని టీవీకే జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ (Felix Gerald) చెప్పారు.తమ నాయకుడు విజయ్పై ప్రజలు విశ్వాసం ఉంచారని, అందుకే ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించామన్నారు. దోపిడీ, అవినీతి, బంధుప్రీతి, కుటుంబ రాజకీయాలకు ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారని అభిప్రాయపడ్డారు. వంశపారంపర్య పాలనకు ముగింపు పలికారని, ఇది డీఎంకేకు ముగింపు అన్నారు. తమకు అండగా నిలిచిన తమిళ ప్రజలకు తమ పార్టీ తరపున ఫెలిక్స్ గెరాల్డ్ ధన్యవాదాలుత తెలిపారు.



