Sunday, January 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'గాంధీ టాక్స్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘గాంధీ టాక్స్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

విజయ్ సేతుపతి, అరవింద్‌ స్వామి, అదితిరావ్‌ హైదరి, సిద్ధార్థ్‌ జాధవ్‌ వంటి హేమా హేమీలు నటించిన సైలెంట్‌ ఫిల్మ్‌ ‘గాంధీ టాక్స్‌’. కిషోర్‌ పాండురంగ్‌ బేలేకర్‌ దర్శకుడు. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం సమకూరుస్తున్న చిత్ర టీజర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. స్టోరీ టెల్లింగ్‌లో శబ్దంతో నిండిన సినిమా ప్రపంచంలోకి సైలెంట్‌ ఫిల్మ్‌గా ఈచిత్రాన్ని తీసుకురావడం ఓ సాహసోపేతమైన ప్రయోగం అని టీజర్‌ చెప్పకనే చెప్పింది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా, వారి దృష్టిని మరల్చనీయకుండా, మాటలతో పని లేకుండా రా ఎమోషన్స్‌తో, కట్టిపడేసే దృశ్యాలతో, భావోద్వేగ ప్రపంచంలోకి ప్రేక్షకులను ఈ టీజర్‌ ఆహ్వానించడం విశేషం. ఒక్క డైలాగ్‌ లేకుండా రూపొందిన ఈ టీజర్‌ ప్రేక్షకుల మనసుల్లో అనేక ప్రశ్నలను సంధించింది.

ఉద్వేగ భరితమైన నిశ్శబ్దంతో కూడిన ఈ ఇంటెన్స్‌ విజువల్స్‌ మనసుల్లో ఓ సంఘర్షణను, అశాంతి, మార్పును సూచిస్తూ గాంధీ నిజంగా ఏదో చెప్పబోతున్నాడనే ఆసక్తిని కలిగించింది. జీ స్టూడియోస్‌ సమర్పణలో క్యోరియస్‌ డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పింక్‌మూన్‌ మెటా స్టూడియోస్‌, మూవీ మిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ అసోసియేషన్‌లో ఈ సినిమా రూపొందింది. సంప్రదాయ సినిమాల హద్దులను ప్రశ్నిస్తూ, నిశ్శబ్దాన్నే కథనంగా అనుభవించే ఒక ధైర్యమైన, విభిన్నమైన థియేట్రికల్‌ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు ఈ సినిమా ఈనెల 30న రిలీజ్‌ కానుందని చిత్రయూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -