Tuesday, May 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఏఈపై ఇరాన్ డ్రోన్ దాడి..ముగ్గురు భారతీయులకు గాయాలు

యూఏఈపై ఇరాన్ డ్రోన్ దాడి..ముగ్గురు భారతీయులకు గాయాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఫుజైరాలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడి కారణంగా ఆయిల్ ఇండస్ట్రీ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులు గాయపడ్డారు. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం గాయపడిన వారికి వైద్య సంరక్షణ అందేలా స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులను యూఏఈ సైన్యం అడ్డుకోగా, నాలుగో క్షిపణి సముద్రంలో కూలిపోయింది. ఈ దాడుల నేపథ్యంలో దుబాయ్, అబుదాబి నగరాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -