- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భద్రాచలం అటవీశాఖ ఎఫ్డీవో సుజాత, చర్ల ఇన్ఛార్జి డీఆర్వో కృష్ణయ్య రూ.3.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రోడ్డు పనుల్లో చెట్లు తొలగించిన కేసును మాఫీ చేసేందుకు సుజాత రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, గురువారం రూ.3.5 లక్షలు అందుకుంటుండగా వీరిని ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



