- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి అధ్యక్షతన గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. వార్డు సభ్యులు తమ తమ కాలనీల్లో నెలకొన్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. గ్రామ పంచాయతీకి నిధులు సమకూరిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ మోర్తాడు ఉదయ్, పంచాయతీ కార్యదర్శి నవీన్, వార్డు సభ్యులు జాల రాజు, శనిగారపు వనజ, పాలేపు రమేష్, గంగుల నందన్, ముసుకు సంతోష్ రెడ్డి, లావణ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



