- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్- 2026లో ఇవాళ కీలక పోరు జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్, గుజరాత్, ఆర్సీబీ జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ, మెరుగైన రన్రేట్తో ఆర్సీబీ టాప్లో కొనసాగుతోంది. ఇవాళ తలపడనున్న రెండు జట్ల బ్యాటర్లు అద్భుత ఫామ్లో ఉండటంతో నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల వర్షం కురిసే అవకాశముంది.
- Advertisement -



