బీఆర్ఎస్ పార్టీ నాయకులు
నవతెలంగాణ – గోవిందరావుపేట : బుస్సాపూర్ టిఆర్ఎస్ సీనియర్ లీడర్ బండపల్లి సాంబయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు కేదారి మరియు రాజశేఖర్ ల తండ్రి బండపల్లి వెంకటయ్య మృతి బాధాకరమని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లాకావత్ నరసింహ నాయక్ మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి అన్నారు. వెంకటయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం చనిపోవడం జరిగింది.విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు లకావత్ నరసింహ నాయక్ మరియు మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి లు కీర్తిశేషులు బండపల్లి వెంకటయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు నాం పూర్ణచందర్ అధికార ప్రతినిధి భూ రెడ్డి మధు బుస్సాపూర్ ప్రధాన కార్యదర్శి వేముల కర్ణాకర్ యూత్ అధ్యక్షులు పిన్నింటి రంజిత్ రెడ్డి సీనియర్ నాయకులు గుండేటి కుమారస్వామి సింగం చందు పోలోజు వెంకటాచారి టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
వెంకటయ్య మృతి బాధాకరం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES