- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వాషింగ్టన్లో జరిగిన కీలక మధ్యవర్తిత్వ చర్చల అనంతరం, లెబనాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 16 నాటి ఒప్పందం ఆదివారంతో ముగియాల్సి ఉండగా, ఈ నిర్ణయంతో తాత్కాలిక ఊరట లభించింది. మే 29న పెంటగాన్లో సైనిక ప్రతినిధులతో, జూన్ 2, 3 తేదీల్లో ఉన్నత స్థాయి రాజకీయ చర్చలు జరపాలని అమెరికా యోచిస్తోంది. అయితే, చర్చల సమయంలోనే ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు చేసింది.
- Advertisement -



