- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ గుండ చంద్రయ్య (72) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
- Advertisement -



