Sunday, May 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే

పదిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని దోస్తుపల్లి గ్రామానికి చెందిన కధం బాలాజీ పదవ తరగతి బోర్డు పరీక్షల్లో జిల్లా స్థాయిలో 10వ ర్యాంకు సాధించాడు. ఈ క్రమంలో జుక్కల్ శాసనసభ్యుడు తోట లక్ష్మీకాంతారావు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థి కుటుంబ సుభ్యులను కలిశారు. అదేవిధంగా కధం బాలాజీని శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందించి, అభినందించారు. కార్యక్రమంలో జుక్కల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ దేశాయ్, దోస్తపల్లి సర్పంచ్ మారోతి, ఉపసర్పంచ్ జ్ఞానేశ్వర్ తో సహా పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యా రంగంలో బాలాజీ సాధించిన అత్యుత్తమ ప్రతిభను కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -