నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో సీఎం విజయ్.. తన టీవీకే కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వ మంత్రివర్గాన్ని విస్తరించాడు. మొత్తం 23 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో 21 మంది టీవీకే ఎమ్మెల్యేలు కాగా.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చెన్నైలోని లోక్భవన్లో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ ఆర్లేకర్.. నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
సీఎం విజయ్ : హోం, పోలీస్, పురపాలక పరిపాలన, అలాగే పట్టణ, నీటి సరఫరా శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. అదనంగా, పేదరిక నిర్మూలన, గ్రామీణ రుణభార నిర్మూలన శాఖలను కూడా బాద్యతవహించనున్నారు.
KA సెంగోట్టయన్ : రెవెన్యూ శాఖతో పాటు జిల్లా రెవెన్యూ వ్యవస్థాపన, ఉప కలెక్టర్లు, విపత్తు నిర్వహణ, భూదాన, గ్రామదాన, శాసనసభ సంబంధిత అంశాలు.
కె.జగదేశ్వరి : మహిళా, సాంఘిక సంక్షేమం,మహిళా సాధికారత
ఎన్. మేరీ విల్సన్ : ఆర్థిక వ్యవహారాలు,పెన్షన్ సంబంధిత ప్రయోజనాలు, ప్రణాళిక-అభివృద్ధి సంబంధిత అంశాలు.
ఆర్.కుమార్ : కృత్రిమ మేధస్సు, సమాచార సాంకేతికత మరియు డిజిటల్ సేవలు.


