- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య తనూజ హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త దిలీప్తో పాటు నేపాలీ వాచ్మన్ సునీల్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పనకు మరో ఆరుగురు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఏడుగురు కలిసి దోపిడీ చేసి, హత్య అనంతరం బంగారాన్ని పంచుకుని పరారైనట్లు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితులు నేపాల్కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
- Advertisement -


