- Advertisement -
3 తులాల బంగారు గొలుసు, చెవి కమ్మలు మాయం
అనుమానాస్పదంగా మహిళ మృతి
నవతెలంగాణ-అక్కన్నపేట
అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బోయిని రాజవ్వ (60) అనే మహిళ గురువారం రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న టైంలో తలపై బలంగా కొట్టి, దారుణంగా గాయపరిచి, ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు, చెవి కమ్మలు అపహరించినట్లు సమాచారం. గాయపడిన రాజవ్వను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు, ప్రజలు తీవ్రంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది దొంగలు చేశారా? ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- Advertisement -



