- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాల ఇస్లాంపురాకు చెందిన మహ్మద్ జావీద్(27) యూరప్లోని మాల్టాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ మేరకు మంగళవారం మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జావీద్.. కారులో వెళ్తుండగా ట్రక్కు బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఉద్యోగం కోసం ఏడాదిన్నర కిందట జావీద్ యూరప్కి వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
- Advertisement -


