నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరిస్తోందని, సీఎం సోదరులు ఏ హోదాతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. చదువు రాని రేవంత్ బ్రదర్స్ సూటు బూట్లుతో కంపెనీలు పెట్టారు. ఆ కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ లేరు.. ఆ కంపెనీకి వేల కోట్ల భూములు కేటాయింపు. 200 కోట్ల విలువ చేసే స్థలాన్ని 7 వేల కోట్లకి కేటాయించారని మండిపడ్డారు.. ఈ భూ కేటాయింపులను వదలం. రేవంత్ షెల్ కంపెనీల బాగోతాన్ని బయట పెడతామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై కేటీఆర్ కీలక ఆరోపణలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



