- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని మహాబేశ్వర్-పోలాద్పూర్ మార్గంలో అంబెనాలి ఘాట్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే ‘సహ్యాద్రి వన్యజీవ రక్షణ సంస్థ’, స్థానిక రెస్క్యూ టీమ్స్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
- Advertisement -



