- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళా సాధికారత లక్ష్యంగా, ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం వికారాబాద్, మధిర ప్రాంతాల్లోని మహిళా సమాఖ్యలకు మంజూరైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి దశలో 6 మెగావాట్ల ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. మహిళా సంఘాలే ఈ ప్లాంట్లను నిర్వహిస్తూ, విద్యుత్ను విక్రయించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందనున్నాయి.
- Advertisement -



