- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి, ఆయన భార్య అధికారుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన నరహరి, జార్ఖండ్కు చెందిన ఆయన భార్య లొంగుబాటుపై కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా, ఎట్టకేలకు వారు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ఈరోజు నిర్వహించనున్న మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.
- Advertisement -



