- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు గురువారం ‘ఈద్-ఉల్-అజా’ (బక్రీద్) పండుగను జరుపుకోనున్నారు. ప్రవక్త ఇబ్రహీం చేసిన గొప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ రోజున ప్రత్యేక ప్రార్థనలు, ఖుర్బానీలు సమర్పిస్తున్నారు.అయితే తొలుత ఇరు రాష్ట్రాలు 27న సెలవు ప్రకటించగా.. నెలవంక ఒకరోజు ఆలస్యంగా దర్శనం ఇవ్వడంతో ముస్లిం పెద్దలు పండగను 28కి మార్చారు. పండగ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా మసీద్ల వద్ద భద్రతను పెంచారు.
- Advertisement -



