– మాట ఇస్తే తప్పను..
– కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నవతెలంగాణ-శామీర్పేట
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, ఎంసీపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీల అభివృద్ధితోపాటు సమస్యల పరిష్కారం తన బాధ్యత అని మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. హైదరాబాద్ మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపల్ కేంద్రం ప్రధాన కూడళ్లలో బుధవారం ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్, మల్లారెడ్డి లాగా దొంగ మాటలు చెప్పనని, మాట ఇస్తే తప్పనని అన్నారు. పదవుల కోసం, హోదా కోసం తానెప్పుడూ ఆలోచించలేదని, పేదల అభ్యున్నతికి కృషి చేశానని చెప్పారు. ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం అందించాలని ఓటర్లను కోరారు.
సమస్యల పరిష్కారం నా బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



